close
Choose your channels

అయినా పోటీ త‌ప్ప‌డం లేదు

Tuesday, May 1, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అయినా పోటీ త‌ప్ప‌డం లేదు

అల్లుడు శీను చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌. ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ త‌న‌యుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఆ త‌రువాత స్పీడున్నోడు, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌తో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం సాక్ష్యం చేస్తూ.. బిజీగా ఉన్నారు. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్త‌రాది భామ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. తొలుత మే 11న విడుద‌ల చేయాల‌నుకున్న ఈ సినిమాని.. జూన్ 14కి వాయిదా వేశారు.

ఈ సినిమా విడుద‌ల తేది మారిన‌ప్ప‌టికీ పోటీ త‌ప్ప‌డం లేదు. మే 11న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ.. అదే స‌మ‌యానికి పూరీ మెహ‌బూబా, రాజ్ త‌రుణ్ రాజుగాడు విడుద‌ల కానున్న‌ట్లు ఆయా చిత్రాల యూనిట్స్ ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో సాక్ష్యంని వాయిదా వేశారు. ఇక సాక్ష్యం కొత్త విడుద‌ల తేది అయిన జూన్ 14న ల‌వ‌ర్‌, స‌మ్మోహ‌నం, తేజ్ ఐ ల‌వ్ యు విడుద‌ల కాబోతున్నాయి. విడుద‌ల తేది మారినా.. సాక్ష్యంకి పోటీ త‌ప్ప‌డం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.