close
Choose your channels

దేశంలో 44 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

Friday, May 28, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో 44 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

దేశంలో భయాందోళనలు కలిగిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నీ మధ్య వరకూ 4 లక్షల పై చిలుకు నమోదైన కేసులు.. ఈ మధ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక గురువారం అయితే ఏకంగా 44 రోజుల కనిష్టానికి కరోనా కేసులు చేరుకోవడం విశేషం. మరణాలు సైతం రెండు రోజులుగా కాస్త అదుపులోకి వచ్చాయి. నాలుగు వేలకు దిగువనే నమోదవుతున్నాయి. అలాగే యాక్టవ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. రికవరీ రేటు పెరుగుతోంది.

ఇదీ చదవండి: ఉల్లిపాయ, ఫ్రిడ్జ్ బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతాయా?

తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గురువారం 20,70,508 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,86,364 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 44 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 13న 1,84,372 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రోజువారీ కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.75 కోట్లు దాటింది. కాగా.. గడిచిన 24 గంటల్లో 3,660 మంది మరణించారు.

ఇప్పటి వరకూ మొత్తంగా కరోనాతో 3,18,895 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.15 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 8.84 శాతానికి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2,59,459 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకూ 2.48 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 90.01 శాతానికి చేరుకుంది. కాగా.. వరుసగా 15వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.