close
Choose your channels

రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ డాలీ మృతి, మాటలు రావడం లేదంటూ సురేఖవాణి పోస్ట్

Saturday, March 19, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్, నటి డాలీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ నటి సురేఖా వాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకుంటూ “డాలీ ఇది అన్యాయం… నమ్మడానికి కష్టంగా ఉంది… నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు… టోటల్లీ బ్లాంక్” అంటూ పోస్ట్ చేశారు. డాలీ మరణవార్త తెలుసుకున్న ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు.

డాలీ అసలు పేరు గాయత్రీ. ఇండస్ట్రీలో జూ.ఆర్టిస్ట్‌ గా పని చేస్తూ యూట్యూబర్‌గా ఫేమస్ అయ్యారు. 'బిగ్ బాస్' ఫేమ్ సిరి హనుమంతు నటించిన 'మేడమ్ సార్ మేడమ్ అంతే'తో పాటు 'జల్సారాయుడు' యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. నటి సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రీతకు డాలీ చాలా సన్నిహితురాలు.

హోలీ పర్వదినం సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పికప్‌ చేసుకున్నాడు రోహిత్‌ అనే వ్యక్తి. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఓ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయత్రి కారును డ్రైవ్‌ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలిలోనే గాయత్రి మరణించగా, రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను గచ్చిబౌలిలోని AIG లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.