close
Choose your channels

మద్యం మత్తులో టవరెక్కి.. అర్ధరాత్రిపూట పోలీసులకు చెమటలు పట్టించిన మందుబాబు

Sunday, May 1, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ్మానాన్న మందలించారనో , ప్రేమలో విఫలమయ్యారనో, భార్యాభర్తల మధ్య గొడవలనో.. ఇలా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. అంతేకాదు.. బెదిరించి తమ పంతం నెగ్గించుకునేందుకు ఆత్మహత్యాయత్నాలు చేసేవారూ అంతే స్థాయిలో వున్నారు. ఈ కోవలోనే సెల్‌టవర్‌లు, విద్యుత్ స్తంభాలు ఎక్కి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్న సామెత ప్రకారం.. కొందరు మందుబాబులు మద్యం మత్తులో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

తాజాగా హైదరాబాద్‌ నగరంలో మద్యం మత్తులో ఒక యువకుడు చేసిన హడావిడి పోలీసులకు, స్థానికులకు చెమటలు పట్టించింది. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు అనే వ్యక్తి మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో దూకుతానంటూ బెదిరించాడు. దాదాపు అర్ధగంట పాటు ఆ ప్రాంతంలో హంగామా చేశాడు. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే అతను ఇలా టెన్షన్ పెట్టడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ నర్సింగ్ రావు గతంలో రెండు పర్యాయాలు టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రి 11 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కి మరోసారి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఎట్టకేలకు అతనిని సురక్షితంగా కిందకు దించి పీఎస్‌కు తరలించారు పోలీసులు. గతంలో ఉద్యోగం కావాలని, భార్య తిట్టి పుట్టింటికి పోయిందంటూ టవర్ ఎక్కాడు నర్సింగ్ రావు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.