close
Choose your channels

1994 నేప‌థ్యంలో సాగే క‌థ‌తో..

Thursday, May 31, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

1994 నేప‌థ్యంలో సాగే క‌థ‌తో..

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఓ గ్యాంగ్ స్టర్ జీవితానికి సంబంధించిన కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కాగా.. 1994 నేపథ్యంలో సాగే పిరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంద‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. 24 ఏళ్ళ క్రితం నాటి వాతావరణం కోసం విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ప్రత్యేకమైన సెట్స్‌ను కూడా డిజైన్ చేస్తున్నారట. వీటి కోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నారని వినికిడి.

హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌కే కేవలం కోటి రూపాయలు ఖర్చు పెట్టారట. టెక్నాలజీ అప్పుడప్పుడే ఎదుగుతున్న ఆ కాలంతో ఓ కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. దర్శకుడు తన పంథాకు భిన్నంగా ఈ సినిమాలో ఇటు యాక్షన్‌తో పాటు.. అటు భావోద్వేగ సన్నివేశాలను కూడా చాలా బలంగా చూపించబోతున్నారని అంటున్నారు. కాగా.. ఈ సినిమాలో శర్వా గ్యాంగ్‌స్టర్‌గా, యంగ్‌స్టర్‌గా రెండు భిన్నమైన పాత్రలను పోషించనున్నారు. ఇందులో హ‌లో ఫేమ్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఓ క‌థానాయిక‌గా నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.