close
Choose your channels

త‌మ‌న్‌కు గ్రేట్ ఆఫ‌ర్‌?

Saturday, July 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మ‌న్‌కు గ్రేట్ ఆఫ‌ర్‌?

అంత‌కు ముందు అర‌వింద స‌మేత‌, ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మ‌రో రేంజ్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఓ డ‌జ‌ను సినిమాలు ఈ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చేతిలో ఉన్నాయి. కాగా.. ఇప్పుడు మ‌రో గొప్ప అవ‌కాశం వ‌చ్చినట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం. అదేంటంటే ఓ పాన్ ఇండియా సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించ‌బోతున్నార‌ని. ఇంతకూ త‌మ‌న్ సంగీతం అందించ‌నున్న పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా? ప‌్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం రాధేశ్యామ్‌. మ‌రి ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జూలియ‌స్ పేకియం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. కాగా ఇప్పుడు లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం త‌మ‌న్ .. రాధేశ్యామ్‌కు సంగీతం అందిస్తే ఓ పాట‌కు మ్యూజిక్ ఇస్తాడా? లేదా పూర్తి సినిమాకు సంగీతం అందిస్తాడా అనే విష‌యంపై ఇంకా క్లారిటీ లేదు.

యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్‌. వ‌చ్చే నెల‌లో హైద‌రాబాద్లో వేసిన భారీ సెట్స్‌లో సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారని టాక్. ఇప్ప‌టికే ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ బారీ షిప్ స‌హా ఓ పెద్ద మార్కెట్‌ సెట్ ను సిద్ధం చేసి ఉంచాడు. 2021లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.