అనుష్క సినిమాలో ఆ నటుడికి 3 కోట్లు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని బాహు భాషా చిత్రాన్ని నిర్మించనున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది. ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 'హార్రర్ ధ్రిల్లర్' గా రూపొందుతున్నఈ చిత్రంలో బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టిలతో పాటు అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
`వస్తాడు నా రాజు` ఫేమ్ హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి నెలలో చిత్రం షూటింగ్ అమెరికా లో ప్రారంభమవుతుందని, 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల చేసేలా నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సెన్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈయనకు ఈ సినిమాలో నటించడానికిగానూ మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ను ఇస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.