టాలీవుడ్ లో మరో త్రయం కలిసినటించనుందా?
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
మనం తర్వాత టాలీవుడ్ లో ఉన్న ఫేమస్ సినిమా వారసులు వారి తాతలు, తండ్రులతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. అక్కినేని ప్యామిలీ తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ వారు ఇప్పుడు కలిసి నటించబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీ శ్రీ` చిత్రాన్ని ముప్పలనేని శివ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్రెడి విజయ నిర్మల, నరేష్ కలిసి నటించనున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్, గౌతమ్ కూడా కలిసి నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే మరో మూడు తరాల నటులు కలిసి నటిస్తున్న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు త్వరలోనే చూస్తారన్నమాట. అయితే ఈ సినిమాలో మహేష్, గౌతమ్ ఎంతసేపు కనపడతారనేది తెలియడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.