close
Choose your channels

బాల‌య్య‌తో మ‌రోసారి ఢీ కొడుతున్నహీరో..

Wednesday, November 25, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ ప్ర‌స్తుతం 99వ సినిమా డిక్టేట‌ర్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌క్రిష్ణ వందో చిత్రాన్ని బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు స‌మాచారం. బోయ‌పాటి అల్లు అర్జున్ తో స‌రైనోడు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. స‌రైనోడు రిలీజ్ త‌ర్వాత బోయ‌పాటి బాల‌య్య వందో చిత్రం పై వ‌ర్క్ చేయ‌నున్నారు.

అయితే ఈ చిత్రంలో బాల‌య్య‌తో ఢీ కొట్టే విల‌న్ పాత్ర‌కు జ‌గ‌ప‌తిని సెలెక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో న‌టించేందుకు గాను జ‌గ‌ప‌తికి భారీగా 3.25 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రాన్ని బాల‌య్య పుట్టిన‌రోజు అయిన జూన్ 10న భారీ స్ధాయిలో ప్రారంభించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.