close
Choose your channels

పోలీసులు వేధిస్తున్నారని కోర్టు మెట్లెక్కిన కమల్

Tuesday, March 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా సెట్‌లో కొన్ని రోజులు క్రితం ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈవీపీ స్టూడియోలో లైటింగ్ కోసం సెట్స్ వేస్తుండగా 150 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా క్రేన్ తెగిపడి టెంట్‌పై పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రొడక్షన్ అసిస్టెంట్లు ప్రమాద స్థలిలోనే కుప్పకూలారు. అయితే ఈ ఘటనలో పోలీసులు డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్‌కు నోటీసులిచ్చారు. విచారణ హాజరుకావాలని సీఐడీ కూడా నోటీసులు జారీ చేసింది.

అయితే ఈ విషయంలో తనను పోలీసులు వేధిస్తున్నారని కమల్ హాసన్ మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. కమల్ అభ్యర్థన మేరకు ఈ పిటిషన్‌ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. ఇవాళ ఈ మధ్యాహ్నం విచారణకు రానుంది. అయితే.. కమల్‌ను పోలీసులు ఎందుకు ఇబ్బందిపెడుతున్నారు..? ఏ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు..? అసలు కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది..? అనే విషయాలు తీర్పు అనంతరం తేలనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.