close
Choose your channels

కరోనా బారినపడ్డ కమల్ హాసన్.. మహమ్మారి మన మధ్యలోనే వుందంటూ ట్వీట్

Monday, November 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా బారినపడ్డ కమల్ హాసన్.. మహమ్మారి మన మధ్యలోనే వుందంటూ ట్వీట్

కోలీవుడ్ దిగ్గజ నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఆ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ ప్రజలకు సూచించారు. తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ట్వీట్ చేశారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌గా నిర్ధారణ జరిగిందని కమల్ చెప్పారు. వైరస్ కారణంగా ప్రస్తుతం హాస్పిటల్ లో ఐసొలేషన్ లో ఉన్నట్టు కమల్ హాసన్ తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

కరోనా బారినపడ్డ కమల్ హాసన్.. మహమ్మారి మన మధ్యలోనే వుందంటూ ట్వీట్

కాగా.. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రతి రోజు కూడా వేలల్లో కేసులు నమోదవుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మహమ్మారి బారిన ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ .. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌లకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.