close
Choose your channels

‘తలైవి’ షూటింగ్‌లో కంగన.. చాలా ఓదార్పునిచ్చే సెట్ అంటూ ట్వీట్..

Monday, October 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘తలైవి’ షూటింగ్‌లో కంగన.. చాలా ఓదార్పునిచ్చే సెట్ అంటూ ట్వీట్..

వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మరణంపై ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం టార్గెట్ చేసి.. ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యింది. మొత్తంగా ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టి ప్రస్తుతం సినిమాలపై కంగన దృష్టి సారించింది. ప్రస్తుతం కంగన చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో భాగంగా కంగన.. తాజాగా ‘తలైవి’ షూటింగ్‌లో పాల్గొంటోంది.

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఈ చిత్రంలో జయలలిత పాత్రను కంగన పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి కొంత మేర షూటింగ్ లాక్‌డౌన్‌కు ముందే పూర్తయింది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన చిత్ర షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభమైంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విష్ణువర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బహు భాషా చిత్రంగా ‘తలైవి’ రూపొందుతోంది.

‘తలైవి’ షూటింగ్‌లో కంగన.. చాలా ఓదార్పునిచ్చే సెట్ అంటూ ట్వీట్..

ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు వెల్లడిస్తూ కంగన ట్వీట్ చేసింది. దీంతో పాటు చిత్రానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను కూడా అభిమానులతో పంచుకుంది. తనకు ఎంతో ఓదార్పునిచ్చే ఫిలిం సెట్‌గా ‘తలైవి’ సెట్‌ను కంగన అభివర్ణించింది. ‘‘గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అద్భుతమైన టాలెంట్‌ కలిగిన డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో నిన్న తెల్లవారుజామున సీన్ గురించి చర్చిస్తున్నప్పుడు తీసిన స్టిల్స్ ఇవి. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన స్థలాలున్నాయి కానీ నాకు చాలా ఓదార్పుతో పాటు కంఫర్ట్‌నిచ్చే ఫిలిం సెట్ మాత్రం ‘తలైవి’’ అని కంగన ట్వీట్ చేశారు.

‘తలైవి’ షూటింగ్‌లో కంగన.. చాలా ఓదార్పునిచ్చే సెట్ అంటూ ట్వీట్..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.