రాజకీయాల పై కరీనా క్లారిటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ అగ్ర నటి, సైఫ్ అలీఖాన్ సతీమణి కరీనా కపూర్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనుందని, మధ్యప్రదేశ్ భోపాల్ నుండి లోక్సభ ప్రతినిధిగా కాంగ్రెస్ తరపున ఆమెను పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ వార్తలను కరీనా కపూర్ ఖండించారు. తననెవరూ రాజకీయాల్లో పోటీ చేయాలంటూ సంప్రదించలేదని, తన దృష్టి సినిమాలపైనే ఉందంటూ ఆమె ప్రకటను వెలువరిచారు. గతంలో హేమామాలిని కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయనుందంటూ వార్తలు వస్తే ఆమె ఖండించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.