close
Choose your channels

ఇల్లందు జేకే మైన్స్‌ను సందర్శించిన కొరటాల.. 7 నుంచి షూటింగ్

Friday, February 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇల్లందు జేకే మైన్స్‌ను సందర్శించిన కొరటాల.. 7 నుంచి షూటింగ్

సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని కోకా పేటలో వేసిన భారీ సెట్‌లో జరగుతున్న విషయం తెలిసిందే. అయితే నెక్ట్స్ షెడ్యూల్ కోసం కొరటాల నేడు సెట్స్‌ను పరిశీలించారు. ఈ షెడ్యూల్‌కు కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని జేకే మైన్స్ అయితే బాగుంటుందని కొరటాల భావించారు. ఈ క్రమంలోనే ఆయన నేడు జేకే మైన్స్‌ను సందర్శించి చిత్రం షూటింగ్‌ కోసం అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను సాయం కోరారు.

ఇల్లందు జేకే మైన్స్‌ను సందర్శించిన కొరటాల.. 7 నుంచి షూటింగ్

అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ చిత్ర షూటింగ్ కోసం స్థానికంగా అనుమతులను ఇప్పించడంతో పాటు చిత్ర మెగాస్టార్‌కి తానే తన నివాసంలో ఆతిథ్యం ఏర్పాటు చేస్తామని కొరటాలకు తెలిపారు. మార్చ్ 7 నుండి 15వరకు ఇల్లందులో ఆచార్య షూటింగ్ జరగనుంది. ఇల్లందు జెకె మైన్స్ ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో చిరంజీవి, రాంచరణ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. మిగతా జిల్లాలతో పోల్చితే పర్యాటక రంగంగా ఖమ్మం అభివృద్ధి చెందిందని కొరటాల పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌ల కోసం కూడా ఖమ్మం జిల్లా ఎంతో అనువైన ప్రదేశమని పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.