close
Choose your channels

ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడటం లేదు: లావణ్య త్రిపాఠి

Saturday, December 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడటం లేదు: లావణ్య త్రిపాఠి

ఇప్పుడు ప్రేక్షకులు ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడటం లేదని అంటుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. కెరీర్‌ ప్రారంభంలో మంచి విజయాలు దక్కించుకుంది లావణ్య. ‘అందాల రాక్షసి’, ‘దూసుకెళ్తా’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘భలే భలే మగాడివోయ్‌', ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది లావణ్య. అయితే సరైన స్క్రిప్ట్‌ ఎంచుకోకపోవడం ఇతరత్రా కారణాలతో లావణ్యకి తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. అయితే రీసెంట్‌గా విడుదలైన ‘అర్జున్‌ సురవరం’తో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సందీప్‌కిషన్‌తో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో నటిస్తోంది.

ఇందులో లావణ్య హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు హీరోయిన్స్‌ స్కిన్‌ షో చేస్తే చూడాలని ప్రేక్షకులు భావించే వారని కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవని, హీరోయిన్‌ లుక్‌, నటన గురించే పట్టించుకుంటున్నారని ఆమె తెలిపారు. తెరపై హీరోయిన్స్‌ను చూసే కోణం మారిందని, కాబట్టి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతుందని, ఇది మంచి పరిణామంగా భావిస్తున్నట్లు తెలిపారు లావణ్య. ఏ1 ఎక్స్‌ప్రెస్‌ తర్వాత లావణ్యకు తెలుగులో మరో అవకాశం లేదు. భవిషత్తులో మరేదైనా సినిమాల్లో నటించడానికి ఎలా సన్నద్ధమవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.