పారిస్లో మహేష్ ఫ్యామిలీ టైం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్స్టార్ మహేష్ నిన్నటి వరకు తన సినిమా మహర్షి చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. సినిమా విడుదల, ప్రమోషన్స్ గ్యాప్లో మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి సమ్మర్ ట్రిప్ అంటూ పారిస్కు వెళ్లారు. అక్కడ తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. 'పారిస్లో ఓ సాయంత్రం .. ఫ్యామిలీ టైం' అంటూ మెసేజ్ కూడా చేశారు మహేష్.
మహేష్ 'మహర్షి' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే 9న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. మహేష్ 25వ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.