close
Choose your channels

ఆ.. ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్..

Saturday, January 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు,త‌మిళ్ లో నిర్మిస్తుంది. ఈ చిత్ర్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ 29న బ్ర‌హ్మోత్స‌వం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.
బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మురుగుదాస్ తో మూవీ చేయ‌డానికి మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభించ‌నున్నారు. తాజాగా...మ‌హేష్..మురుగుదాస్ మూవీ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మ‌హేష్ - శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్లో రూపొందే సినిమాని డైరెక్ట‌ర్ జ‌యంత్ సి ప‌రాన్జీ నిర్మించ‌నున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల‌, జ‌యంత్ సి ప‌రాన్జీ ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌ల‌సి మ‌హేష్ తో మూవీ చేస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్ప‌డింది.అయితే.. శేఖ‌ర్ క‌మ్ముల మ‌హేష్ తో ఏత‌ర‌హా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడ‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.