close
Choose your channels

మహేష్‌తో జాన్వి సినిమా.. ఎప్పుడంటే?

Wednesday, March 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహేష్‌తో జాన్వి సినిమా.. ఎప్పుడంటే?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో వార్తలు వినబడుతూనే ఉన్నాయి. గతంలో హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆ ఊసే లేదు. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన జాన్వీ కపూర్ నటించనుందట. ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా ద్వారా మరో కొత్త దర్శకుడు సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం కాబోతున్నారని టాక్.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒక్కో సినిమాను ఏడాదిలో కంప్లీట్ చేస్తే.. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులైతే రెండేళ్ల వరకూ తీసుకుంటారు. కానీ ఈ సినిమా షూటింగ్‌ను మాత్రం రెండు నెలల్లోనే కంప్లీట్ చేస్తారని టాక్. మరి నిజంగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ వీరిద్దరి జోడీలో నిజంగా సినిమా వస్తే మాత్రం అభిమానులకు పండుగే. ఎందుకంటే.. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి జాన్వీ తల్లి అలనాటి అందాల తార శ్రీదేవితో కలిసి నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి.

ఇన్నాళ్లకు ఆయన కుమారుడు, ఆమె కుమార్తె కలిసి నటిస్తున్నారంటే ఆ సినిమాకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మరి ఈ సినిమా ఊహాగానాలవరికేనో నిజ కాగా మహేశ్‌ ప్రస్తుతం 'గీతా గోవిందం' ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. కాగా.. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారమైతే ఈ సినిమా తర్వాత జాన్వీతో చేస్తాడట. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేస్తాడట. నిజానికి రాజమౌళితో సినిమా అంటే ఎవరైనా పక్కనబెడతారా? ఒకవేళ రాజమౌళికి కుదరకపోతే తప్ప.. ఆయనతో సినిమాను ఎవరూ వదులుకోరు. ఈ లెక్కన చూస్తే మహేష్, జాన్వీల మూవీ ఫిక్స్ అయినా కూడా తెరకెక్కడం మాత్రం లేటే అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.