close
Choose your channels

మీలో ఎవరు కోటీశ్వరుడు నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మించే 3 చిత్రాల వివరాలు..!

Friday, November 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్ చిత్రాల‌తో సూపర్‌హిట్స్ అందించిన నిర్మాత కె.కె.రాధామోహ‌న్. ప్రస్తుతం లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు సెన్సార్‌ పూర్తి చేసుకొని నవంబర్‌లోనే విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్ర నిర్మాత రాధామోహ‌న్ మరో మూడు చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా జనవరిలో ఓ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఇంకో చిత్రాన్ని నిర్మించనున్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాల ప్లానింగ్‌లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం విడుదల సన్నాహాల్లో నిర్మాత కె.కె.రాధామోహన్‌ చాలా బిజీగా వున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.