close
Choose your channels

Rahul Gandhi:మోదీ-కేసీఆర్ ఒక్కటే.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజాపాలన చూపిస్తాం: రాహుల్ గాంధీ

Monday, November 27, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో ప్రధాని మోదీకి కేసీఆర్ సహకరిస్తారు.. తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకరిస్తారని విమర్శించారు. తనపై 24 కేసులు పెట్టారని.. ఎంపీ సభ్యత్వం రద్దు చేసి తన ఇల్లు లాక్కున్నారని.. కానీ అవినీతిపరుడైన కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి, అంథోల్‌లో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములు ఆక్రమించుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజా పాలన అంటే ఏంటో చూపిస్తామని వివరించారు.

శనివారం రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్‌లోని నిరుద్యోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నానని.. పేపర్ లీకేజీ వల్ల వారు ఎంతో నష్టపోయారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఖర్చు చేసి పోటీ పరీక్షలకు సిద్ధమైతే అవి రద్దవడంతో వారి బాధలు వర్ణనాతీతమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులకు రూ.5లక్షలతో యువ వికాసం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును రికవరీ చేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఆ నగదును పేదల ఖాతాల్లో వేస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు.

ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే 6 గ్యారెంటీలపై సంతకం పెట్టి అమలు చేస్తామని స్పష్టం చేశారు. 'మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అలాగే వారి ఖాతాలో ప్రతి నెలా రూ.2,500 వేస్తాం. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేల చొప్పున సాయం అందిస్తాం. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం' అని రాహుల్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.