close
Choose your channels

ద‌ర్శక సంఘం అధ్య‌క్షుడిగా ఎన్‌.శంక‌ర్‌

Monday, March 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆదివారం హైద‌రాబాద్‌లో జరిగిన తెలుగు చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుల సంఘం ఎన్నిక‌ల్లో ప్రముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ ఎన్నికైయ్యారు. సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్‌.శంక‌ర్ గెలిచారు.

ఆయ‌న‌తో పాటు ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల్లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జి.రాంప్ర‌సాద్‌, కోశాధికారిగా కాశీ విశ్వ‌నాథ్‌, ఉపాధ్య‌క్షులుగా ఎ.య‌స్‌.ర‌వికుమార్, ఎస్‌.వి.భాస్క‌ర్‌రెడ్డి ఎన్నికైయారు.

సంయుక్త కార్యదర్శులుగా కట్టా రంగారావు, ఎమ్‌.ఎస్‌.శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా డీవీ రాజు(కళింగ), ఎన్‌ గోపీచంద్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్‌ అడ్డాల, అనిల్‌ రావిపుడి, ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూదన్‌ రెడ్డి, కృష్ణ మోహన్, కృష్ణ బాబు, చంద్రకాంత్‌ రెడ్డి విజయం సాధించారు.

నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.