close
Choose your channels

వారం గ్యాప్ లో నాగశౌర్య రెండు చిత్రాలు

Saturday, December 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ క‌థానాయ‌కుడు నాగశౌర్య వచ్చే సంవత్సరం ఆరంభంలో రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆ రెండు చిత్రాలే ఛ‌లో, క‌ణం. వీటిలో ముందుగా ఛలో` సినిమా తెర‌పైకి రానుంది. ఈ యాక్షన్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీకి వెంకీ కుడుముల దర్శకుడు. కన్నడ నటి రష్మిక మందన్న ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది. ఉష మల్పూరి నిర్మించిన‌ ఈ సినిమా.. డిసెంబ‌ర్ 29న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల‌ ఫిబ్రవరి 2కి ఈ చిత్రం వాయిదా ప‌డిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అలాగే ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కణం` చిత్రంలోనూ నాగ‌శౌర్య క‌థానాయ‌కుడిగా న‌టించాడు. సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్‌ నిర్మించింది. దీపావ‌ళికి విడుద‌ల కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ ఫిబ్రవరి 9కి వాయిదా ప‌డింది. మొత్తానికి.. వారం రోజుల గ్యాప్ లో నాగశౌర్య రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడ‌న్న‌మాట‌. మ‌రి ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా అనుకున్న స‌మ‌యానికి వ‌స్తుందో చూడాలి. చాలాకాలంగా స‌రైన విజ‌యం లేని శౌర్య‌కి ఈ చిత్రాల స‌క్సెస్ కీల‌కంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.