close
Choose your channels

హిమాలయాల్లో నాగ్.. ట్విట్టర్ వేదికగా చెప్పిన విక్కీ కౌశల్..

Sunday, October 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హిమాలయాల్లో నాగ్.. ట్విట్టర్ వేదికగా చెప్పిన విక్కీ కౌశల్..

వీకెండ్ వచ్చిందంటేనే బిగ్‌బాస్ షోకి చాలా హైప్ క్రియేట్ అవుతుంది. దానికి కారణం హోస్ట్ నాగార్జున. నాగ్ వస్తున్నారంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ శని, ఆదివారాల్లో మాత్రం నాగ్ కనిపించలేదు. ఆ లోటు కనిపించకుండా చేయడానికి శనివారం ఏదో నడిపించేశారు. కానీ ఆదివారం మాత్రం అక్కినేని వారి కోడలు సమంత వచ్చి ఆ లోటును మాత్రం చాలా వరకూ భర్తీ చేయగలిగింది. కానీ నాగ్ ఏమయ్యారు? అనేదే అందరి డౌట్.

ప్రస్తుతం నాగ్ ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని నటుడు విక్కీ కౌశల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన తండ్రి శ్యామ్ కౌశల్ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో జరుగుతోంది. కాబట్టి నాగ్ ‘వైల్డ్ డాగ్’ కోసం హిమాలయాల్లో ఉన్నారని విక్కీ కౌశల్ వెల్లడించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా దియా మీర్జా నటిస్తోంది. సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అహిషోర్ సోల్‌మేన్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దాదాపు ఆరు నెలల తర్వాత నాగ్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్‌కి పూర్వమే ఈ చిత్రం చాలా వరకూ పూర్తైంది. ప్రస్తుతం మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.