నాగ్ తర్వాత చైతన్యతో నటిస్తోన్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటితో స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది కీర్తి సురేశ్. తర్వాత ఈ అమ్మడుకి భారీ హిట్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో పాటు.. నాగార్జున జోడిగా `మన్మథుడు2`లో నటించింది. దీని తర్వాత కూడా నాగార్జున సీక్వెల్ మూవీయే చేస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, చైతన్య కలిసి `సొగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్గా `బంగార్రాజు` సినిమా చేయబోతున్నారు. ఇందులో చైతన్య సరసన కీర్తి సురేశ్ను నటింప చేయడానికి చర్చలు జరుగుతున్నాయట. అంతా ఒకే అయితే తండ్రి తర్వాత తనయుడితో సినిమా చేసే హీరోయిన్ కీర్తిసురేశ్ ఓ క్రెడిట్ దక్కించుకుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.