close
Choose your channels

ల‌స్ట్ స్టోరీస్‌పై నందినీ రెడ్డి వివ‌ర‌ణ‌

Tuesday, November 5, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ల‌స్ట్ స్టోరీస్‌పై నందినీ రెడ్డి వివ‌ర‌ణ‌

డిజిటల్ మీడియా హ‌వా కొన‌సాగుతున్న త‌రుణంలో ప‌లు వెబ్ సిరీస్‌లు రూపొంద‌నున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌ల ట్రెండ్ త‌మిళం, తెలుగులోనూ స్టార్ట్ అయ్యాయి. కొన్ని నెల‌లు క్రితం బాలీవుడ్‌లో అడ‌ల్ట్ కంటెంట్‌తో రూపొందిన ల‌స్ట్ స్టోరీస్‌కి మంచి ఆద‌రణ ద‌క్కింది. ఇప్పుడు తెలుగులోనూ ల‌స్ట్ స్టోరీస్‌ను రోనీ స్క్రూనీవాలా రూపొందిస్తున్నార‌ని వార్త‌లు వినిపించాయి. నందిని రెడ్డి, త‌రుణ్ భాస్క‌ర్‌, సందీప్, సంక‌ల్ప్ రెడ్డి ఈ ల‌స్ట్ స్టోరీస్‌ను తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే సందీప్ వంగా ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడు. కాగా మిగిలిన ముగ్గురిలో నందిని రెడ్డి తాను డైరెక్ట్ చేస్తున్న వెబ్ సిరీస్‌పై స్పందించారు. హిందీలో రూపొందిన ల‌స్ట్ స్టోరీస్‌ను తెలుగులో రీమేక్ చేయ‌లేదు. వేరే క‌థ‌ల‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నామ‌ని ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు.

ఓ బేబీ వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నందీని రెడ్డి ఓ అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించ‌డం..అందులోనూ ద‌క్షిణాది ద‌ర్శ‌కులే వీటిని తెర‌కెక్కించ‌డం టాప్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. నాలుగు భాగాలుగా తెర‌కెక్క‌బోయే ఈ వెబ్‌సిరీస్‌లో నందిని రెడ్డి భాగంలో జ‌గ‌ప‌తిబాబు, అమ‌లాపాల్ న‌టిస్తున్నారు. నందిని రెడ్డి తన భాగానానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేసుకున్నారు. ఇప్పుడు సంక‌ల్ప్ రెడ్డి త‌న భాగానికి సంబంధించి షూటింగ్ చేస్తున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్‌చేయ‌బోతున్నాడు. మ‌రి సందీప్ వంగా స్థానంలో ఆ ల‌స్ట్ స్టోరీస్‌ను ఎవ‌రు తెర‌కెక్కిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.