close
Choose your channels

విద్యాబాలన్ ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం

Wednesday, July 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విద్యాబాలన్ ను ఆత్మీయంగా స్వాగతించిన ఎన్.టి.ఆర్ కుటుంబం

బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నేడు ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి పూల బొకేతో విద్యాబాలన్ కు స్వాగతం తెలిపారు. అలాగే.. నందమూరి వంశం రివాజు ప్రకారం ఆమెకు చీరను బహుకరించారు.

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆయన సతీమణి బసవతారకం పాత్ర పోషించనున్న విద్యాబాలన్ ఎన్.టి.ఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడంతోపాటు.. లోకేశ్వరిని అడిగి బసవతారకం వ్యవహారశైలి ఎలా ఉంటుంది, ఆమెకు ఇష్టమైన విషయాలేమిటి, హాబీస్ ఏమిటి అనేవి అడిగి తెలుసుకున్నారు విద్యాబాలన్.ఈ ఆత్మీయ పరిచయ తేనీటి విందులో నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవి, ఆయన చిన్నకుమార్తె తేజస్విని మరియు ఆయన చిన్న అల్లుడు శ్రీభరత్ పాలుపంచుకున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన విద్యాబాలన్ బుధవారం నుంచి ఎన్.టి.ఆర్ సెట్స్ లో పాల్గొననున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. విద్యాబాలన్ ఓ వైవిధ్యమైన గెటల్ లో కనిపించనున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. నందమూరి బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.