close
Choose your channels

పారికర్ మరణం బాధాకరం: జనసేనాని

Monday, March 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పారికర్ మరణం బాధాకరం: జనసేనాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం బాధాకరమని.. తన తరఫున.. జనసైనికుల తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పారికర్‌తో తనుకు మంచి పరిచయం ఉందని.. ఆయనతో కలిసి 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను పవన్ గుర్తు తెచ్చుకున్నారు.

పారికర్ ఆత్మకు శాంతి చేకూరాలి!

"సమకాలీన రాజకీయాలపైనా, సామాజిక అంశాలపైనా మాట్లాడుకున్నాం. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఆవేదన కలిగించింది. గోవా ముఖ్యమంత్రిగా, దేశ రక్షణ మంత్రిగా పారికర్ అందించిన సేవలు గుర్తుంచుకోదగ్గవి. సాధారణ జీవన శైలిని అనుసరించిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. పారికర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.