వేశ్య పాత్రలో పాయల్ రాజ్పుత్
Send us your feedback to audioarticles@vaarta.com
1970 దశకంలో రాబిన్ హుడ్గా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురంలో పేరు మోసిన దొంగ. ఈయన జీవితకథతో `టైగర్` అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. అనీల్ సుంకర నిర్మాణంలో వంశీ కృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.
అందులో ఒకరిగా `ఆర్.ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్పుత్ను తీసుకున్నారు. కాగా మరో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించనుంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి పాయల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. పాయల్ టైగర్ చిత్రంలో వేశ్య పాత్రలో కనపడుతుందట. ఛాలెంజింగ్గా అనిపించడంతో వేశ్య పాత్రలో నటించడానికి పాయల్ ఓకే చెప్పానని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.