close
Choose your channels

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

Monday, May 27, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. మెుత్తం 12 జిల్లాల్లో 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్‌‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

నార్కట్‌పల్లిలోని డోకూరు ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తరపున డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో స్వతంత్ర అభ్యర్థి అశోక్ అక్కడకు చేరుకున్నారు. దీంతో డబ్బులు పంచటాన్ని అడ్డుకున్నందుకు ఆయనపై దాడి చేసినట్లు చెబుతున్నారు. వీడియో రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపైనా దాడి చేసి కెమెరాలు, ఫోన్లు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఓడిపోతున్నామనే భయంతోనే తనపై దాడి చేసినట్లు అశోక్ ఆరోపించారు.

ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆయన ఆందోళన చేపట్టారు. ప్రలోభాలను అడ్డుకోవటంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకుంటున్న వారిపై దాడులు చేయడం అందరూ ఖండించాలని కోరారు.

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

ఇదిలా ఉంటే ఈ ఘటన మినహా మిగతా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తుర్కపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన సతీమణి మమతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటేశారు. హనుమకొండ పింగిలి మహిళా కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న పోటీలో ఉండగా.. బీఆర్ఎస్ తరపున ఏనుగు రాకేష్ రెడ్డి, బీజేపీ తరపున గజ్జుల ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ పోటీ చేస్తున్నారు. మరి వీరిలో ఎవరిని పట్టభద్రులు అందలం ఎక్కిస్తారో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment