close
Choose your channels

YS Jagan:పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే అడ్డుపడుతున్నారు: జగన్

Friday, March 1, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. విద్యార్థులకు మంచి చేయడం కోసం వారితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. కృష్ణా జిల్లా పామర్రులో జగనన్న విద్యాదీవెన పథకం కింద అక్టోబర్-డిసెంబర్-2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు.

'వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. మన పిల్లలు చదవొద్దా.?. తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు. పిల్లలకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ ప్రచారం చేస్తున్నారు. పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి. చంద్రబాబు, ఆయన మనుషుల పెత్తందారీ భావజాలాన్ని గమనించండి. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు చంద్రబాబు ఎప్పుడైనా ప్రయత్నించారా.? పేద విద్యార్థుల కోసం ఆయన చేసిన మంచి ఏంటి.?. ఆయన ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా.?. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రైవేట్ విద్యా సంస్థల కోసమే' అంటూ మండిపడ్డారు.

పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని.. అందుకే విద్యారంగం అభివృద్ధికి ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నాడు - నేడుతో స్కూళ్ల రూపురేఖలే మార్చేశామన్నారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలని.. ప్రపంచంతో పోటీ పడేలా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని.. విద్యార్థులకు ట్యాబ్స్ అందుబాటులోకి తెచ్చి డిజిటల్ పద్ధతిలో బోధనకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఇస్తున్నామని చెప్పారు. 57నెలల్లో విద్యారంగంలో ఎలాంటి మార్పులు తెచ్చామో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. పెత్తందారులకు, పేదలకు మధ్య జరుగుతుందని.. ఈ యుద్ధంలో పేదలు గెలవకపోతే కూలీల పిల్లలు కూలీలుగా మిగిలిపోతారని జగన్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos