హాయ్ డార్లింగ్స్.. చాలా అద్భుతంగా ఉంది: ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ సినిమా 'సాహో' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కుతున్న ఈ సానిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్టర్లు, షెడ్స్ ఆఫ్ సాహోతో ఇప్పటికే సినిమా అంచనాలు భారీగా పెంచేసింది ‘సాహో’. అయితే అభిమానులు, సినీ ప్రియుల కోసం ప్రభాస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు.
తాజాగా.. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ డార్లింగ్స్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "హాయ్ డార్లింగ్స్.. ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. షూటింగ్ ఇక్కడే జరుగుతోంది. గతంలో ఇలాంటి అనుభూతులను ఎప్పుడూ చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్యూ ఎవరీ వన్" అని తన ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ రాసుకొచ్చారు. కాగా.. ప్రభాస్ షేర్ చేసిన ఈ ఫొటోలో శ్రద్ధాకపూర్తో పాటు చిత్ర యూనిట్ కూడా ఉంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మందిరా బేడి, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ తదితరులు బాలీవుడ్ దిగ్గజాలు నటించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలోకి తీసుకురావడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.