రవితేజ సరసన ప్రగ్యా జైస్వాల్..
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఎవడో ఒకడు. ఈ చిత్రాన్ని ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన ఈ మూవీని ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసారు. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మరో హీరోయిన్ గా కంచె ఫేం ప్రగ్యా జైస్వాల్ ని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నిఅందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఎవడో ఒకడు సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.