మహేష్ కు కోర్టు సమన్ల నుండి ఊరట...
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
శ్రీమంతుడు సక్సెస్తో పాటు మహేష్కు సమస్యలను కూడా తెచ్చి పెట్టింది. స్వాతి మేగజైన్లోని చచ్చేంత ప్రేమ అనే నవలను తన అనుమతి లేకుండా కాపీ కొట్టారని రచయిత ఆర్.డి.విల్సన్ అలియాస్ శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కాపీరైట్ చట్టాన్ని పరిశీలించిన నాంపల్లి మొదటి ఎంఎస్జె కోర్టు..నిర్మాతలుగా మహేష్బాబు, నవీన్ ఎర్నేనిలు కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఈ ఉత్వర్వులపై కొరటాల శివ, మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థ పిటిషన్స్ ఫైల్ చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి విన్న హైకోర్టు న్యాయమూర్తి క్రింద కోర్టు జారీ చేసిన సమన్లను నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టు సమన్ల నుండి మహేష్ అండ్ టీంకు ఊరట లభించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.