'సాక్ష్యం' కు క్రేజీ ఆఫర్
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
అల్లుడు శీను` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత స్పీడున్నోడు`, జయ జానకి నాయక` సినిమాలతో పలకరించాడు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం`లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది.
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 11న విడుదలవుతుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులకు క్రేజీ ఆఫర్ దక్కించి జీ టీవీ వారు తెలుగు హక్కులను 5.5 కోట్లకు, హిందీ శాటిలైట్ హక్కులను 8 కోట్లకు అంటే మొత్తంగా 13.5కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ను పూర్తి చేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.