అక్టోబర్ 18న 'సరోవరం'రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.శ్రీలత మాట్లాడుతూ... సరోవరం సినిమాను అందరూ ఇష్టపడి తీసాము. మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు, మీడియా వారికి ధన్యవాదాలు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ సురేష్ యడవల్లి మాట్లాడుతూ... సరోవరం అనే గ్రామంలో జరిగిన కథ ఇది. ఎమోషనల్ గా నడిచే ఈ కథలో మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హీరో, హీరోయిన్ బాగా నటించారు. తనికెళ్ల భరణి, ఛత్రపతి శేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. అక్టోబర్ 18న ఈ సినిమాను థియేటర్స్ లో చూసి మమ్మల్ని దీవించండని తెలిపారు.
జబర్దస్త్ నవీన్, రాము మాట్లాడుతూ... సరోవరం సినిమా అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిగింది. మాస్ కు కావాల్సిన అంశాలతో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసే ఎలిమేంట్స్ ఈ సినిమాలో ఉన్నాయన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.