close
Choose your channels

శిరీష్ తో శీరత్....

Friday, March 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు అర‌వింద్ త‌న‌యుల్లో ఒక‌డైన అల్లు శిరీష్ హీరోగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నాడు. ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు అంటూ ఓ హిట్ సాధించాడు. ఇప్పుడు మోహ‌న్‌లాల్‌తో క‌లిసి 1971 బియాండ్ ది బోర్డర్ అనే మ‌ల‌యాళ చిత్రంలో న‌టించాడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుద‌ల కానుంది. ఇప్పుడు శిరీష్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో సుర‌భి ఓ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో శీర‌త్‌క‌పూర్ కూడా హీరోయిన్‌గా న‌టించనుంది. ప్ర‌స్తుతం శీర‌త్ రాజుగారి గ‌ది2 సినిమాలో న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.