close
Choose your channels

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ట్రైలర్ విడుదల చేసిన 'జీ 5', గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

Wednesday, December 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

షూట్-అవుట్ ఎట్ ఆలేరు ట్రైలర్ విడుదల చేసిన జీ 5, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'. తాజాగా మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామాను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. 'జీ 5' కోసం ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మించిన వెబ్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'. మంగళవారం సాయంత్రం వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.

పోలీసులను నడిరోడ్డు మీద తుపాకీతో కాల్చి చంపుతున్న ఘటనలు వార్తల్లో ముఖ్యాంశం అవుతుంది. 2007 నుండి 2010 వరకు ప్రతి ఏడాది మక్కా మసీదు బాంబు బ్లాస్ట్ యానివర్సరీ రోజున హిందూ పోలీసులను చంపిన అక్తరే, ప్రస్తుత మరణాలకు కారణమా? అని మీడియా సందేహం వ్యక్తం చేస్తుంది. ఐదేళ్ల క్రితం ఎన్కౌంటర్ లో మరణించిన అక్తర్ మరణాలకు కారణం అంటే పోలీసులు నమ్ముతున్నారా? మరణించిన అక్తర్ మళ్లీ ఎలా బతికొచ్చాడు? తమపై సాగిస్తున్న హత్యాకాండకు పోలీసులు ఎలా ముగింపు పలికారు? వంటి విషయాలు వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తాయని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

'లూజర్' నుండి 'చదరంగం', 'గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)' వరకు... ఒరిజినల్ వెబ్ సిరీస్ నుండి డైరెక్ట్-టు-ఒటిటి ఫీచర్ ఫిలిమ్స్ వరకూ... కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా - డిఫరెంట్ జానర్ కంటెంట్ 'జీ 5' ప్లాట్‌ఫామ్ వీక్షకులకు అందించింది. 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'తో మరోసారి వీక్షకుల మనసు గెలుచుకునేలా ఉంది.

'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను నెలకొల్పి... తొలి ప్రయత్నంగా నిర్మించిన వెబ్ సిరీస్ 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు'. 'జీ 5' అసోసియేష‌న్‌తో ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ వెబ్ సిరీస్ 'జీ 5'లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ తదితరులు ప్రధాన పాత్రధారులు. దీనికి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని 'జీ 5' వర్గాలు వెల్లడించాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.