close
Choose your channels

ఆత్మహత్యకు 2 రోజుల ముందు దేవరాజ్‌ను కలిసిన శ్రావణి..

Friday, September 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆత్మహత్యకు 2 రోజుల ముందు దేవరాజ్‌ను కలిసిన శ్రావణి..

బుల్లితెర నటి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు.. దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణ. వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. గతంలో శ్రావణి ఎస్ఆర్ నగర్‌లో దేవరాజ్‌పై కేసు నమోదు చేసింది. జైలు నుంచి విడుదల అయిన తరువాత శ్రావణిని కలిశాడు. ఆ సమయంలో దేవరాజ్‌పై శ్రావణికి ప్రేమ ఉండటంతో దేవరాజ్‌తో కలిసి సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ వీడియో విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా జాగ్రత్త పడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.

దేవరాజ్‌పై శ్రావణి ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటంటే.. దేవరాజ్.. శ్రావణి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వస్తున్నాడు. శ్రావణిని రోడ్డుకు ఈడుస్తానంటూ బెదిరించడంతో ఆమె కుటుంబ సభ్యులకు దేవరాజ్‌పై ఆగ్రహం ఏర్పడింది. బెదిరింపుల విషయం తెలుసుకున్న శ్రావణి తన సోదరి, బావ, సోదరుడితో కలిసి వెళ్లి దేవరాజ్‌ను నిలదీసింది. ఈ సమయంలోనే దేవరాజ్‌కు శ్రావణి కుటుంబ సభ్యులకు మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో దేవరాజ్‌పై శ్రావణి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు.

తనపై దాడికి పాల్పడిన శ్రావణి కుటుంబ సభ్యులపై దేవరాజ్ ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శ్రావణి కూడా దేవరాజ్‌పై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దేవరాజ్‌పై సెక్షన్ 354 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరాజ్‌ను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌‌పై విడుదలైన అనంతరం కూడా దేవరాజ్‌తో శ్రావణి తన సాన్నిహిత్యాన్ని కొనసాగించింది. శ్రావణి ఆత్మహత్యకు రెండు రోజుల ముందు హోటల్ శ్రీకన్యలో దేవరాజ్‌ను శ్రావణి కలిసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన సాయికి.. దేవరాజ్‌కి మధ్య గొడవ జరిగింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.