యాక్షన్ చేయబోతున్న సిమ్రాన్, త్రిష
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, ఇప్పటి ట్రెండింగ్ స్టార్ త్రిష కలిసి ఓ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో నటించబోతున్నారు. సుమంత్ రాధాకృష్ణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పేట్ట తర్వాత సిమ్రాన్, త్రిష కలిసి చేస్తున్న చిత్రమిది.
విజయ రాఘవేంద్ర నిర్మాత. కోలీవుడ్లో ఇద్దరు ప్రముఖ హీరో్యిన్స్తో రూపొందుతోన్న యాక్షన్ చిత్రమిది. థాయ్లాండ్, చెన్నై, కేరళ, పిచ్చావరం తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించబోతున్నారు.
పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కావడంతో సిమ్రాన్, త్రిషలు యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి తగిన విధంగా శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. త్వరలోనే సినిమా సెట్స్కు వెళ్లనుంది. త్రిష, సిమ్రాన్లతో పాటు ఇతర ప్రముఖ నటీనటులు ఇందులో సందడి చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.