close
Choose your channels

సుశాంత్ పోస్ట్‌మార్టం తుది నివేదిక ఏం తేల్చిందంటే...

Wednesday, June 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుశాంత్ పోస్ట్‌మార్టం తుది నివేదిక ఏం తేల్చిందంటే...

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం తుది నివేదక వచ్చేసింది. ఆయన మృతి పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనది ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధారణ అయినప్పటికీ.. హత్య అంటూ ఆరోపణలు వినిపించాయి. కానీ పోస్టుమార్టం తుది నివేదిక మాత్రం సుశాంత్‌ది ఆత్మహత్యేనని తేల్చింది. సుశాంత్‌ది ఆత్మహత్యేనంటూ ఐదుగురు వైద్యులు ధృవీకరిస్తూ సంతకాలు చేశారు. అనుమానాస్పదంగా ఏమీ జరగలేదని.. సుశాంత్ శరీరంపై కూడా ఎటువంటి గాయాల తాలూకు ఆనవాళ్లు లేవని తుది నివేదికలో వెల్లడైంది. ఉరి వేసుకోవడంతో సుశాంత్‌కు ఊపిరాడలేదని.. దీంతోనే మరణించాడని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.