close
Choose your channels

థియేటర్ల యాజమాన్యాలకు ఊహించని షాకిచ్చిన తలసాని

Wednesday, May 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

థియేటర్ల యాజమాన్యాలకు ఊహించని షాకిచ్చిన తలసాని

కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవచ్చన్న హైకోర్టు ఆదేశాల మేరకు థియేటర్ల యాజమాన్యాలు అనుకున్నట్లుగానే టికెట్లు పెంచేశాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో 80 నుండి 110 రూపాయలు, మల్టిఫ్లెక్స్ థియేటర్‌లలో 138 నుండి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచేశాయి. టికెట్ల ధరలు పెంపుతో అభిమానులు, సినిమా లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సర్కార్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.

బుధవారం మధ్యాహ్నం సీఏస్, హోం సెక్రటరీ, లా సెక్రటరీతో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమీక్ష నిర్వహించారు. సినిమా టికెట్ల ధరలు ఏక పక్షంగా పెంచడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా సినిమా టికెట్ ధరలు పెంచడమేంటి..? అంతా మీ ఇష్టమేనా అంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే థియేటర్ల యాజమాన్యాలు మాత్రం కోర్టు ఉత్తర్వుల మేరకే టిక్కెట్ ధరలు పెంచామని చెబుతున్నాయి. అయితే థియేటర్ల యాజమాన్యం తీరుపై కన్నెర్రజేసిన సర్కార్.. హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది.

ఎస్.. కోర్టుకెళ్తున్నాం..

సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరల పెంపు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. కోర్టు డైరెక్షన్ వల్ల నిన్న థియేటర్ వాళ్లు వాళ్లంతట వాళ్లే రేట్లు పెంచినట్లు వార్తలు విన్నాం ఇది సబబు కాదన్నారు. డైరెక్షన్‌తో 79 థియేటర్లు రేట్లు పెంచినట్లు మా దృష్టికి వచ్చిందని సామాన్యులు కూడా సినిమా చూడాలంటే రేట్లు తక్కువగానే ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. నిన్న ఒక మీడియాలో వచ్చిన కథనాలు చూసి తాను రియాక్ట్ అయ్యానన్నారు. ఇవాళ హోమ్, లా కార్యదర్శితో మాట్లాడి నిశితంగా చర్చించామన్నారు. ప్రభుత్వం ఎక్కడ రేట్లు పెంచమని చెప్పలేదని.. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వానికి లేదన్నారు. ఫైనల్‌గా మేము కోర్టులో పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని తేల్చిచెప్పారు.

మొత్తానికి చూస్తే మంగళవారం సాయంత్రం మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వం పిటిషన్ వేస్తే పరిస్థితేంటి..? గతంలో టికెట్లు పెంచుకోవచ్చని కోర్టు చెప్పినట్లుగానే పాటిస్తుందా..? లేకుంటే థియేటర్ల యాజమాన్యాలకు మొట్టికాయలేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.