close
Choose your channels

తమన్నా పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌!!

Wednesday, August 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమన్నా పేరెంట్స్‌కు క‌రోనా పాజిటివ్‌!!

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ న‌టించిన త‌మ‌న్నా భాటియా.. ఈరోజు త‌న త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందనే విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు. వివ‌రాల్లోకెళ్తే.. రెండు, మూడు రోజులుగా త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుండ‌టంతో కుటుంబంతో స‌హా అంద‌రూ క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు. టెస్టులో త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు పాజిటివ్ రిజిల్ట్ రాగా.. త‌మ‌న్నా, ఇత‌ర సిబ్బందికి క‌రోనా నెగ‌టివ్ రిజ‌ల్ట్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు త‌మ‌న్నా. అంద‌రి ప్రార్థ‌న‌లు, దేవుడి ఆశీర్వాదాలు, ద‌య‌తో వారు త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని భావిస్తున్న‌ట్లు త‌మ‌న్నా తెలిపారు.

సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం స‌త్య‌దేవ్‌తో క‌లిసి త‌మ‌న్నా ఓ సినిమా చేస్తుంది. మ‌ల‌యాళ చిత్రం ‘ల‌వ్‌మాక్‌టైల్‌’కు తెలుగు రీమేక్ ఇది. ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ ఖ‌రారైంది. ఈ నెల 28 న సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. నాగ‌శేఖ‌ర్ ఈ చిత్రానికి దర్శ‌క నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే తెలుగు ఓటీటీలోనూ తమన్నా ఓ స్పెషల్ షో చేయనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.