close
Choose your channels

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి కన్నుమూత.. విషాదంలో టీటీడీ

Monday, November 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి కన్నుమూత.. విషాదంలో టీటీడీ

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు.  సోమవారం వేకువజామున గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు.

విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన డాలర్ శేషాద్రి అక్కడే మరణించారు. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి ఆలయంలో డాలర్ శేషాద్రి విధులు నిర్వర్తిస్తున్నారు. 2007లోనే ఆయన పదవి విరమణ చేశారు. అయితే శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలోనే ఆయన వున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి కన్నుమూత.. విషాదంలో టీటీడీ

డాలర్ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానానికి తీవ్రనష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేమని అభిప్రాయపడ్డారు.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.