close
Choose your channels

ట్రైలర్ విడుదల చేస్తున్న మహేష్, సమంత...

Monday, February 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పివిపి సంస్థ బ్యాన‌ర్‌ఫై అడివిశేష్‌, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా అన‌సూయ ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం క్ష‌ణం. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. హీరో ఓ కేసు చేదించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమి చేశాడనేదే ప్రధాన కథాంశం2015లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నామినేట్ అయిన అమెరికన్ సినిమాటోగ్రాపర్ షానియెల్ డియో సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించారు. సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం సూప‌ర్‌స్టార్ మ‌హేష్, స‌మంత‌లు క‌లిసి ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఫిభ్ర‌వ‌రి 10న విడుద‌ల చేయ‌బోతున్నారు. అధికార‌కంగా స‌మాచారం రావాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.