close
Choose your channels

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతి

Thursday, September 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతి

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన పరిస్థితి విషయమించడంతో రాత్రి తుదిశ్వాస విడిచారు. కరోనాతో మృతి చెందిన తొలి కేంద్ర మంత్రి సురేష్ అంగడి కావడం గమనార్హం. సురేష్ అంగడి కర్ణాటకలోని బెళగావిలో 1955 జూన్ 1న జన్మించారు. ఆయనకు భార్య మంగల్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

1996లో ఆయన బీజేపీ బెల్గాం జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం బెల్గాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగానూ.. ఆ తరువాత బీజేపీ బెల్గాం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2004లో సురేష్ అంగడి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి.. 2014 మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో కూడా ఆయన లోక్‌సభకు ఎన్నికవడంతో బీజేపీ ఆయనకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా నియమించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.