close
Choose your channels

మహాసముద్రంలోని సెకండ్ సింగిల్ `చెప్పకే చెప్పకే..`ను రిలీజ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న

Tuesday, September 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహాసముద్రంలోని సెకండ్ సింగిల్ `చెప్పకే చెప్పకే..`ను రిలీజ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న

సిద్దార్థ్, శర్వానంద్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోరు మీదున్నాయి. దసరా కానుక‌గా అక్టోబర్ 14న ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతోంది. ఆర్ ఎక్స్ 100 తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

మహాసముద్రంలోని సెకండ్ సింగిల్ `చెప్పకే చెప్పకే..`ను రిలీజ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న

ఇటీవ‌ల ఈ చిత్రం నుండి విడుద‌లైన‌ మాస్ సాంగ్ `హే రంభ` పాట‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. . ఇక తాజాగా రెండో పాట చెప్పకే... చెప్పకే... ఒక బ్రీజీ మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా విడుదల చేశారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట అదితి రావు హైదరి మీద చిత్రీక‌రించిన‌ప్ప‌టికీ ఈ లిరికల్ వీడియోలో సిద్దార్థ్, శర్వానంద్, అను ఇమాన్యుయెల్ కూడా కనిపిస్తున్నారు.

త‌మ పక్కింటి కుర్రాడైన శర్వానంద్‌ను అదితి రావ్ హైదరి ఎంత‌గానో ప్రేమిస్తుంది. సీక్రెట్‌గా ఆమె శర్వానంద్‌ను ఫాలో అవుతూ.. ఓ ఊహా ప్రపంచంలో బ్ర‌తికేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే అను ఇమాన్యుయేల్ శర్వానంద్ జీవితంలోకి వస్తుంది. దాంతో అదితి సిద్దార్థ్‌కు సన్నిహితంగా మారుతుంది. ఈ పాటకు చైతన్య ప్రసాద్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. దీప్తి పార్థసారథి గాత్రం వినసొంపుగా ఉంది. ఇది కచ్చితంగా శ్రోతల హృదయాల్లో నిలిచిపోయే పాట అవుతుంది.

మహాసముద్రంలోని సెకండ్ సింగిల్ `చెప్పకే చెప్పకే..`ను రిలీజ్ చేసిన హీరోయిన్ రష్మిక మందన్న

ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.

ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 14న ‘మ‌హా స‌ముద్రం’ విడుద‌ల‌వుతుంది

నటీన‌టులు: శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్‌, జ‌గ‌ప‌తిబాబు, అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.