'వెంకీమామ' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్లో రూపొందిన చిత్రం `వెంకీమామ`. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు `యు/ఎ` సర్టిఫికేట్ వచ్చింది. సినిమా వ్యవథి 149.23 నిమిషాలుగా ఫిక్సయ్యింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారి వెంకీ, చైతు కాంబినేషన్ నటిస్తున్నారు.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో డి.సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా విడుదల డిసెంబర్ 13న విడుదల కావడం ఖాయమైంది. వెంకటేశ్ రైతు పాత్రలో నటిస్తుంటే చైతన్య ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. రియల్ లైఫ్లో మామ, అల్లుడైన వెంకటేశ్, చైతన్య రీల్ లైఫ్లోనూ మామ, అల్లుడిగా నటిస్తుండటం విశేషం. చైతన్య ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా చేసిన యాక్షన్ సన్నివేశాలను -4 డిగ్రీల చలిలో కాశ్మీర్ చిత్రీకరించడం విశేషం.
ఈ చిత్రం తర్వాత వెంకటేశ్ తమిళ చిత్రం `అసురన్` రీమేక్లో నటించబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కాగా.. నాగచైతన్య ఇప్పటికే ప్రారంభమైన శేఖర్ కమ్ముల సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత పరుశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ అనుబంధ సంస్థ జీఏ 2లో నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.