close
Choose your channels

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న విజ‌య్‌..

Monday, May 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న విజ‌య్‌..

‘అర్జున్ రెడ్డి’ విజయం తర్వాత చేతినిండా సినిమాలతో బిజీగా మారిన నటుడు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ. తాజాగా మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ యంగ్ హీరో. ఆ వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా ‘అలా మొదలైంది’ దర్శకురాలు నందినీ రెడ్డితో విజయ్ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. త్వరలో ఈ కాంబినేషన్ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ పతాకంపై స్వప్నదత్, ప్రియాంకాదత్ నిర్మించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో విజయ్‌ నటిస్తున్న ‘నోటా’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా పూర్తైన తర్వాత.. నందినీరెడ్డి సినిమాతో పాటు.. డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ డైరెక్షన్‌లో రూపుదిద్దుకోబోయే ‘డియర్ కామ్రేడ్’ సినిమాని కూడా సమాంతరంగా సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. విజయ్ నటించిన ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.