రాములమ్మ మళ్ళీ ఆ పార్టీలోకి ?


Send us your feedback to audioarticles@vaarta.com


టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి పార్టీ మార్పు విషయమై క్లారిటీ వచ్చేసింది. దుబ్బాక ఫలితానికి ముందు వరకూ సందిగ్ధంలో ఉన్న రాములమ్మ ఆ తరువాత మాత్రం పార్టీ మార్పుపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే విజయశాంతి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వెళ్లి వచ్చిన అనంతరమే బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
రాములమ్మ ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మంగళవారం రాములమ్మ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయశాంతి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్.. రాములమ్మను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments