close
Choose your channels

Sharmila:షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ.. కాంగ్రెస్‌లో చేరే అవకాశం..!

Monday, January 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌గా రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే ఆమె సోదరుడు సీఎం జగన్‌ పాలనపై వాడివేడి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ వైయస్ కుటుంబాన్ని జగనే చీల్చారు.. తనను వాడుకుని వదిలేశారు లాంటి వ్యక్తిగత విషయాలతో పాటు వైసీపీ ప్రభుత్వం పాలనపైనా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అన్నాచెల్లి మధ్య రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఈ క్రమంలోనే దివంగత మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత.. షర్మిలతో భేటీ కావడం సంచలనంగా మారింది. కడప జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ఇడుపులపాయ వెళ్లిన షర్మిలతో సునీత రెడ్డి సమావేశమయ్యారు. ఇద్దరు కలిసి వైయస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కడప జిల్లా వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. అదే జిల్లాలో సోదరుడు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఇద్దరు చెల్లెళ్లు భేటీ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టి్స్తున్నాయి. వీరిద్దరు ఏం మాట్లాడకున్నారో దానిపై ఉత్కంఠ నెలకొంది.

కొద్ది రోజుల నుంచి వైయస్ ఫ్యామిలీలోని చాలా అంశాలను షర్మిల ప్రస్తావిస్తూ వస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు, కుటుంబం ఎందుకు నిలువునా చీలిపోయింది.. ఇందుకు ఎవరు కారణం.. ఇలా ప్రతి అంశంలో జగన్‌ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. అయితే బాబాయ్ వైఎస్ వివేకానంరెడ్డి హత్య కేసుపై మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి నిందితుడిగా అరెస్టై జైలులో ఉన్నారు. ఇక జగన్‌ మీద ఈ కేసులో ఆరోపణలు వస్తున్నాయి. అన్ని విషయాలపై జగన్‌ను ప్రశ్నిస్తున్న షర్మిల.. ఈ అంశంపై మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో షర్మిలతో సునీత భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఇక నుంచి వివేకా హత్య కేసును కూడా షర్మిల ప్రస్తావిస్తారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే సునీతారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు షర్మిల సిద్ధమయ్యారని టాక్. ఇందుకు సునీత కూడా ఓకే చెప్పారట. ఒకవేళ ఆమె కానీ హస్తం పార్టీలో చేరితే సునీతను కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారట. వైయస్ వివేకానందర్ రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి హస్తం ఉందని ఆమె సీబీఐకి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. అలాగే పలు పిటిషన్లలో సునీత స్వయంగా ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్‌లో చేరి కుటుంబసభ్యులపై పోటీ చేయడానికి రెడీ అయ్యారట. ఎలా చూసుకున్నా ఇటు షర్మిల లేదా అటు సునీత ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కడప జిల్లాతో పాటు ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment